తారకరత్న ఆరోగ్యం పై స్పందించిన కళ్యాణ్ రామ్

-

యువగళం పేరుతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శుక్రవారం కుప్పం నియోజకవర్గం నుంచి పాదయాత్ర మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ పాదయాత్రలో నందమూరి తారకరత్న పాల్గొని అస్వస్థతకి గురయ్యారు. ఆయనని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా గుండెపోటు వచ్చినట్లుగా వైద్యులు తెలిపారు. తారకరత్నకు గుండె నాళాల్లో ఎక్కువగా బ్లాక్గ్స్ ఉన్నట్లు గుర్తించారు.

యాంజియోగ్రామ్ ద్వారా బ్లాక్ లను తొలగించారు. మరింత మెరుగైన వైద్యం కోసం తారకరత్న ని బెంగళూరుకు తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే బెంగళూరులో చికిత్స పొందుతున్న తారకరత్న ఆరోగ్యం పై కళ్యాణ్ రామ్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా.. “నా సోదరుడు శ్రీ నందమూరి తారకరత్న త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను ” అని ట్విట్ చేశారు. కాగా తారకరత్న ఆరోగ్యం ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news