‘‘భారతీయుడు-2’’పై కమల్ హాసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

-

ఇండియన్ జీనియస్ డైరెక్టర్ దర్శకత్వంలో వచ్చిన ‘‘భారతీయుడు’’ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతిని ప్రశ్నిస్తూ తెరకెక్కిన ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఇక ఈ మూవీలో కమల్ హాసన్ తన నట విశ్వరూపం చూపించారు.

మ్యూజిక్ కూడా సూపర్ హిట్ అయింది. చాలా కాలం నుంచి ఈ చిత్రానికి సీక్వెల్ తీయాలనుకున్న మేకర్స్ ఎట్టకేలకు సీక్వెల్ ప్రారంభించారు. కానీ, క్రేన్ ప్రమాదంతో ‘‘భారతీయుడు-2’’ సినిమా అర్ధాంతరంగా ఆగిపోయింది. అయితే, ఈ చిత్ర షూటింగ్‌ను పున:ప్రారంభించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తాజాగా లోకనాయకుడు కమల్ హాసన్ తెలిపారు.

లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘‘విక్రమ్’’ ఫిల్మ్ ప్రమోషన్స్‌లో కమల్ హాసన్ ‘‘భారతీయుడు-2’’పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘విక్రమ్’’ వచ్చే నెల 3న పాన్ ఇండియా వైడ్ గా అన్ని భాషల్లో విడుదల కానుంది. రూ.200 కోట్ల బడ్జెట్‌తో గ్రాండియర్ గా ‘‘ఇండియన్-2’’ పిక్చర్ తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు.

శంకర్ ప్రస్తుతం టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో RC15 ఫిల్మ్ చేస్తున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తుండగా, ఇప్పటికే సినిమా 50 శాతం షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ తర్వాత శంకర్..‘‘ఇండియన్-2’’ సీక్వెల్ పైన ఫోకస్ చేస్తారో లేదో చూడాలి..

Read more RELATED
Recommended to you

Latest news