సోము వీర్రాజు వియ్యంకుడు బిఆర్ఎస్ లో ఎందుకు చేరాడు – కన్నా లక్ష్మీనారాయణ

-

ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీరుపై బిజేపి నేత కన్నా లక్ష్మీనారాయణ అసహనం వ్యక్తం చేశారు. బిజేపి జిల్లా అధ్యక్షుల మార్పును తప్పుబట్టారు కన్నా. కోర్ కమిటిలో చర్చ జరగకుండానే జిల్లా అధ్యక్షులను మార్చారని అన్నారు. అధ్యక్షుల మార్పు తనతో చర్చించలేదని.. ఇప్పుడు తొలగించిన వాళ్లంతా తాను నియమించిన వాళ్లేనని అన్నారు. కోర్ కమిటి సమావేశం తప్ప పార్టీలో ఇతర ఏ సమాచారం మాకు తెలియడం లేదని అసహనం వ్యక్తం చేశారు.

తాను రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నప్పడు ఎంతో మందిని బిజేపి లో జాయిన్ చేశానని.. ఇప్పడు వాళ్లంతా ఎందుకు పార్టీ వీడుతున్నారో వీర్రాజు సమాధానం చెప్పాలన్నారు. సోము వీర్రాజు వియ్యంకుడు బిఆర్ఎస్ లో ఎందుకు చేరాడో సోము వీర్రాజు ను అడగాలన్నారు. ఎంపీ జీవీఎల్ ఆలోచన స్థానిక బిజేపి కార్యకర్తల అభిప్రాయాలకు ఎప్పుడూ భిన్నంగా ఉంటుందన్నారు. అమరావతి రాజధాని సహా అనేక అంశాలలో జీవీఎల్ వైఖరి చూశామన్నారు. జగన్ – కేసిఆర్ కుట్ర లో భాగంగానే బిఆర్ఎస్ లోకి ఏపి నేతలు చేరికవుతున్నారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news