ఆ కళాశాలలో పెరుగుతున్న కరోనా బాధితులు… ఇప్పటికే 281 మందికి..

-

కాస్త నిర్లక్ష్యంగా ఉండి.. కరోనా నిభందనలు పాటించకుంటే కరోనా కనికరం చూపించదు. వ్యాక్సిన్ వేసుకున్న మళ్లీ అటాక్ చేసే అవకాశం ఉంది. సరిగ్గా ఇలాంటి సంఘటనే కర్ణాటక ధార్వాడ్ లోని ఎస్డీఎమ్ వైద్య కళాశాలతో చోటు చేసుకుంది. ఇటీవల ఈ కళాశాలలో వైద్య విద్యార్ధులకు ఒక్కసారిగా కోవిడ్ సోకింది. బాధితులంతా వ్యాక్సినేషన్ చేయించుకున్నా.. కరోనా సోకడం కలవరపరిచింది. తాజాగా కోవిడ్ బారిన పడ్డ విద్యార్ధుల సంఖ్య 281కి చేరింది. ఇంకా 1,822 శాంపిల్స్​ ఫలితాలు రావాల్సి ఉంది. దీంతో మరెంత మంది కోవిడ్ బారిన  పడుతారో తెలియాల్సి ఉంది.corona-virus

ఇటీవల కాలేజ్ లో జరిగిన ఓ ప్రెషర్ పార్టీనే ఇంత పెద్ద సంఖ్యలో మెడికల్ స్టూడెంట్లకు కోవిడ్ సోకడానికి కారణమైంది. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు సైతం పాల్గొన్నారు. ప్రస్తుతం కరోనా నిర్ధరణ అయిన 281 మందిలో కేవలం ఆరుగురిలో మాత్రమే కొవిడ్​ లక్షణాలు కనిపించాయని, మిగతా వారికి ఎలాంటి లక్షణాలు లేవని అధికారులు తెలిపారు. విద్యార్థులందరినీ క్వారంటైన్​కు తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news