కర్ణాటకలో “హంగ్”… జేడీఎస్ కింగ్ మేకర్ గా మారనుందా ?

-

రేపు ఈ సమయానికి కర్ణాటక ఎన్నికల భవితవ్యం బయటపడనుంది. అధికారంలో ఉన్న బీజేపీనే తిరిగి గద్దెనెక్కుతుందా లేదా కాంగ్రెస్ అధికార పీఠాన్ని దక్కించుకుంటుందా అన్న విషయం తేలిపోనుంది. కాగా తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం రేపు వెలువడనున్న ఫలితాలలో అటు కాంగ్రెస్ కు కానీ ఇటు బీజేపీ కి కానీ స్పష్టమైన మెజారిటీ రాదట. పూర్తి ఓట్లు లెక్కింపు ముగిసే సమయానికి హంగ్ ఏర్పడే అవకాశం ఉండనని విశ్వసనీయవర్గాల సమాచారం. ఒకవేళ ఇలా జరిగితే జేడీఎస్ కింగ్ మేకర్ గా మారే అవకాశం ఉంది. గత ఎన్నికల్లోనూ ఇదే విధంగా జరిగినా , ఆ తర్వాత బీజేపీ దొడ్డిదారిలో అధికారంలోకి వచ్చింది.

కానీ ఈసారి జేడీఎస్ ఎవరికీ మద్దతునిస్తుంది అన్న విషయంలో స్పష్టత లేదు. కుమారస్వామి ఇప్పుడే తమ ఎమ్మెల్యే అభ్యర్థులను రిసార్ట్ లకు తరలిస్తున్నాడట. మరి ఏమి జరగనుందో తెలియాలంటే రేపటికి వరకు ఆగాల్సిందే.

 

Read more RELATED
Recommended to you

Latest news