కర్ణాటక మాజీ సీఎం బంధువు హత్య కేసులో వెలుగులోకి సంచలన అంశాలు !

-

కర్ణాటక మాజీ సీఎం బంధువైన సిద్ధార్థ్ సింగ్ హత్య కేసులో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే సిద్ధార్థ సింగ్ తండ్రి దేవేందర్ సింగ్ రెండో భార్య ఇందూ సింగ్ అరెస్టయ్యారు. ఇందూ సింగ్ తన ప్రియుడితో కలిసి హత్యకు పాల్పడినట్లుగా మొదట పోలీసులు భావించారు. ఈ హత్య వెనుక ఆమె హస్తం కచ్చితంగా ఉందని పోలీసులు భావిస్తున్నారు.

అయితే ఇప్పుడు కొత్తగా తండ్రి దేవేందర్ సింగ్ కి కూడా ఈ హత్య తెలిసే జరిగిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇందూ సింగ్ తో ప్రధాన నిందితుడు శ్యామ్ సన్నిహితంగా మెలిగినట్లు పోలీసులు గుర్తించారు. ఇందూ సింగ్ శ్యాం ఖాతాలోకి భారీగా నగదు బదిలీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయం బయటపడడంతో శ్యాం ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. శ్యామ్ ఆత్మహత్య చేసుకోవడంతో ఈ కేసులో రెండో నిందితుడుగా ఉన్న వినోద్ ను పోలీసులు విచారిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news