దారుణం : అక్రమ సంబంధం నెపంతో కన్న తల్లిని రేప్ చేసి చంపాడు !

-

సొంత తల్లిపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో కర్ణాటకలోని హవేరి జిల్లాకు చెందిన 21 ఏళ్ల వ్యవసాయ కూలీని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఓ వ్యక్తి తన తల్లి చాలా మంది పురుషులతో అక్రమ సంబంధం పెట్టుకుందని ఆరోపిస్తూ ఆమెను హత్య చేశాడు. నవంబర్ 12 సాయంత్రం, తల్లి అతని కొడుకు ఈ విషయం మీద గొడవ పడ్డారని ఆ తర్వాత అతడు తన తల్లిని అత్యాచారం చేసి చంపాడని పోలీసులలు గుర్తించారు. షిగ్గావ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 40 ఏళ్ల మహిళ తన కుమారుడితో కలిసి వనహళ్లిలోని నివసిస్తోంది.

సదరు మహిళ భర్త 15 సంవత్సరాల క్రితం మరణించాడు. దీంతో ఆమె దే ప్రాంతానికి చెందిన మరొక వ్యక్తితో సంబంధం కలిగి ఉంది. అయితే మీ అమ్మ చాలా మంది పురుషులతో సంబంధాలు కలిగి ఉందని ఆ ప్రాంత వాసులు ఆమె కొడుకుని సూటిపోటి మాటలతో బాధించారు.  దీంతో కోపంగా ఉన్న అతను, తన తల్లి ప్రియుడి గురించి గతంలో పలు సందర్భాల్లో ఆమెతో గొడవ పడ్డాడు. హత్యకు వారం రోజుల ముందు కూడా తన తల్లితో వాగ్వాదానికి దిగాడని, అయితే ఆమె తన ప్రియుడితో తన సంబంధాన్ని తెంచుకోనని ఆమె తేల్చి చెప్పిందని షిగ్గావ్ పోలీసులు తెలిపారు. నవంబర్ 12 ఉదయం ఆ మహిళ కుమారుడు ఆమెకు బలవంతంగా మద్యం తాగించి అనంతరం ఆమెను అత్యాచారం చేసి గొంతు కోసి చంపాడని పోలీసులు తేల్చారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news