కాశ్మీర్ ఫైల్స్ సినిమాకు బీజేపీ పాలిత రాష్ట్రాల పన్ను మినహాయింపు

-

ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న సినిమా కాశ్మీర్ ఫైల్స్. కాశ్మీర్ లో 1990ల్లో పండిట్ల ఊచకోత, హిందువులపై అత్యాచారాలు, కాశ్మీర్ లో స్థానికులుగా ఉన్న చాలా మంది పండిట్లు వేరే ప్రాంతాలకు వలసవెళ్లడం, ఆనాటి ప్రభుత్వాల ఎలా వ్యవహరించాయి వంటి అంశాలతో కాశ్మీర్ ఫైల్స్ సినిమా రూపొందింది. ఈ సినిమాకు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎంటర్టైన్మెంట్ టాక్స్ మినిహాయింపు ఇస్తున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలైన కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్, హర్యానా, గోవాలతో పాటు మహారాష్ట్రలో కూడా టాక్స్ ను మినహాయించారు. ప్రతీ ఒక్కరూ ఈ సినిమాను చూడాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు కోరుతున్నారు. రాజస్థాన్ లో కూడా పన్ను మినహాయింపు ఇవ్వాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరారు.

ఇటీవల కాశ్మీర్ ఫైల్స్ చిత్ర యూనిట్ ప్రధాని మోదీని కూడా కలిశారు. సినిమా బాగుందంటూ.. ప్రధాని కూడా పొగిడారు. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం పోలీసులకు లీవ్ లు కూడా ఇస్తున్నట్లు వెల్లడించింది. పవర్ ఫుల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లనే రాబడుతోంది. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో జీ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మించింది. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్ మరియు పల్లవి జోషి నటించారు.

Read more RELATED
Recommended to you

Latest news