నిజామాబాద్‌ చౌరస్తాలో అరవింద్ ను చెప్పుతో కొడుతా – కల్వకుంట్ల కవిత

-

నిజామాబాద్‌ చౌరస్తాలో ఎంపీ అరవింద్ ను చెప్పుతో కొడుతానని కల్వకుంట్ల కవిత వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ ఎంపీ ధర్మపూరి అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ నేతల దాడి చేశారు. బీజేపీ ఎంపీ ధర్మపూరి అరవింద్ ఇంట్లోకి చొచ్చుకని వెళ్లి…వస్తువులను ధ్వంసం చేశారు. ఈ సంఘటనపై కల్వకుంట్ల కవిత స్పందించారు.

ఎంపీ అరవింద్ పై మండిపడ్డ ఎమ్మెల్సీ కవిత.. నిజామాబాద్ పేరును అరవింద్ పాడుచేస్తున్నారని నిప్పులు చెరిగారు. పార్లమెంటులో అరవింద్ పెర్‌ ఫార్మెన్స్ సున్నా.. నేను కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు ఖర్గేతో మాట్లాడినట్టు అరవింద్ చెబుతున్నారని ఓ రేంజ్‌ ఓ ఫైర్‌ అయ్యారు.. కాంగ్రెస్ తో కలిసి గెలిచింది నువ్వు.. బురదమీద రాయి వేయకూడదని ఊరుకున్నా.. రాజకీయాలు చెయ్.., పిచ్చి వేషాలు వేయకు.. ఇవాళ బాధతో మాట్లాడుతున్నానని చురకలు అంటించారు ఎమ్మెల్సీ కవిత.

Read more RELATED
Recommended to you

Latest news