టీఆర్ఎస్‌ వర్గాల్లో కవిత పదోన్నతిపై చర్చ…!

-

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం తేలాల్సి ఉంది. ఇక్కడ టీఆర్‌ఎస్‌కు బలం ఉండటంతో కవిత ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం లాంఛనమే. కాకపోతే పోలింగ్‌ సమయంలో జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు చేసిన కామెంట్స్‌పై ఇప్పుడు పార్టీలో హాట్ హాట్ చర్చ జరుగుతోంది. కవిత కేబినెట్‌లో చేరతారని కొందరు లెక్కలు వేసుకుంటుంటే.. కేబినెట్‌ హోదాతో సమానమైన పదవి వస్తుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

తెలంగాణలో రెండోసారి టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక KTRను కేబినెటలోకి తీసుకోలేదు. దాంతో పార్టీ నేతలంతా మంత్రివర్గంలో KTR ఉండాలని పెద్ద ఎత్తున గళం వినిపించారు. ఇంకొందరైతే.. కేటీఆర్‌ మంత్రిగా లేకపోవడం వల్ల.. పట్టణాల అభివృద్ధి వేగంగా లేదని అధినేత దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత జరిగిన కేబినెట్‌ విస్తరణలో ఆయనకు చోటు కల్పించారు. ఇప్పుడు కవిత విషయంలోనూ పార్టీ నేతలు అదే విధమైన స్వరం వినిపిస్తున్నారట. కాబోయే మంత్రి అంటూ బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ చేసిన కామెంట్స్‌ ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు.

అసెంబ్లీ సభ్యుల సంఖ్య ప్రకారం తెలంగాణలో ముఖ్యమంత్రి సహ కేబినేట్ సభ్యుల సంఖ్య 18కి మించకూడదు. ప్రస్తుతం మంత్రివర్గంలో ఖాళీలు లేవు. ఒకవేళ కవితను కేబినేట్‌లోకి తీసుకోవాలంటే ప్రస్తుతం ఉన్నవారిలో ఎవరో ఒకరు రాజీనామా చేయడం లేదా తప్పించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అటువంటి పరిణామాల తర్వాత కవితను కేబినేట్‌లోకి తీసుకుంటారా అన్న చర్చ జరుగుతోంది. కవితను శాసనమండలిలో విప్‌గా నియమించడానికి ఆప్షన్ ఉంది. లేదంటే ఏదైన కీలకమైన కార్పొరేషన్‌కు చైర్మన్‌ను చేస్తారని.. కేబినెట్‌ ర్యాంక్‌ కల్పిస్తారనే చర్చ పార్టీ వర్గాల్లో ఉందట.

Read more RELATED
Recommended to you

Latest news