సీఎం కేసీఆర్ బర్త్ డే : కాలినడకన తిరుమలకు ఎమ్మెల్సీ కవిత

-

తిరుపతిలోని అలిపిరి వద్ద తెలంగాణ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమం లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. దేవుని దయ వల్ల రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు చల్లగా ఉండాలని ఈ సందర్భంగా కవిత ఆకాంక్షించారు. అలాగే కాలినడకన తిరుమలకు బయల్దేరారు టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. కెసిఆర్ జన్మదిన వేడుకలు పండుగ వాతావరణంలో జరుగుతున్నాయని.. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిణామాలపై స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అందుకే మా నాయకుడు స్పందించారని.. ఫ్రంట్ లను పక్కనబెట్టి దేశ రాజకీయ పరిణామాలపై ప్రతి ఒక్కరూ స్పందించాలన్నారు.

భవిష్యత్ లో దేశవ్యాప్త చర్చ జరుగుతుందని చెప్పారు. ప్రధాని…తెలంగాణ సిఎం  కెసిఆర్ కి పోన్ చేసి విషెస్ చెప్పడం మామూలేనని.. రాజకీయం వేరు, సాన్నిహిత్యం వేరు అన్నారు. గత ఎన్నిక ల్లో బిజెపికి డిపాజిట్ లు కూడా రాలేదు ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news