కెసిఆర్ అనుభవం అంత లేదు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడి వయసు – మంత్రి సత్యవతి రాథోడ్

-

మునుగోడులో తన స్వంత ప్రయోజనం కోసమే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని ఆరోపించారు మంత్రి సత్యవతి రాథోడ్. 3 యేండ్లు ఎమ్మెల్యేగా ఉండి ఎం చేయని ఎమ్మెల్యే రాజగోపాల్ ఇవాళ ఎం చేస్తాడని ప్రశ్నించారు. ఆయనను ఓడగేట్టేందుకు మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. మునుగోడు ప్రజలు రాజగోపాల్ రెడ్డి తిరస్కరిస్తారని అన్నారు.

కేసీఆర్ తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించారని అన్నారు. సీఎం కేసీఆర్ రాజకీయ అనుభవం అంత లేని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఇష్టవచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా మునుగోడులో నిల్వబోతుందన్నారు. నల్గొండ జిల్లాలో ఇప్పటికి 3 ఉప ఎన్నికలు వచ్చాయి.. అందులో ఇప్పటికే 2 భారీ మెజారిటీతో గెలిచామన్నారు.

రాజగోపాల్ కాంట్రాక్టుల కోసమే బీజేపీలోకి వెళ్లారని ఆరోపించారు. పొరటల్లో ముందున్న కమ్యూనిస్టు పార్టీలు నేతలు మాకు మద్దతుగా ఉన్నారని అన్నారు. కేసీఆర్ ఒక మేన మామా లాగా ఆడపిల్లకు అండగా ఉండి కల్యాణ లక్ష్మీ వంటి పథకాలు పెట్టారని.. మునుగోడులో ఆడబిడ్డలు, కొత్త కోడళ్లు టిఆర్ఎస్ కి అండగా ఉన్నారని వాళ్ళ ఓట్లు తొలగించాలని చూస్తున్నారు.. కానీ వీళ్ళు ఓట్లు తొలిగించాలని చెప్పిన టిఆర్ఎస్ కు అండగా ఉంటారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news