బ్రేకింగ్; ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కెసిఆర్…!

-

ఆర్టీసి కార్మికులకు ఇచ్చిన మాటను తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ నిలబెట్టుకున్నారు. సమ్మె కాలంలో ఆర్టీసి ఉద్యోగ్యులకు జీతాలు చెల్లిస్తామని చెప్పిన కెసిఆర్ చెప్పిన విధంగా నిధులు విడుదల చేయించారు. సమ్మె కాలంలో ఆర్టీసి ఉద్యోగుల జీతాల కోసం తెలంగాణా ఆర్ధిక శాఖ నిధులు విడుదల చేసింది. ఇందుకోసం దాదాపు 235 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ తెలంగాణా ఆర్ధిక శాఖ ఉత్తర్వ్యులు ఇచ్చింది.

దీనిపై ఆర్టీసి ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకోసం ముఖ్యమంత్రి కెసిఆర్ కి ధన్యవాదాలు చెప్తున్నారు. ఇచ్చిన మాట మాట నిలబెట్టుకున్నారు అని, అందుకు ధన్యవాదాలు చెప్తున్నామని అని అన్నారు. మూడు నెలల క్రితం తెలంగాణా ఆర్టీసి కార్మికులు సమ్మెకు దిగారు. దాదాపు రెండు నెలల పాటు ఈ సమ్మె కొనసాగింది. పలువురు కార్మికులు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news