కేసీఆర్ అబద్ధాల ప్రొఫెసర్ :టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

-

పార్లమెంట్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. మెజార్టీ సీట్లు గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ఎన్నికల కదనరంగంలో హోరాహోరీగా ముందుకు సాగుతున్నారు.ఒకరిపై ఒకరు విమర్శలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాజకీయాల రసవతరంగా మారాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గాంధీభవన్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అబద్ధాల ప్రొఫెసర్ కేసీఆర్ అని అన్నారు.

కేసీఆర్ తన ఇంటి పేరు కల్వకుంట్ల అని తీసేసి అబద్ధాల అని పెట్టుకోవాలని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ బాధ రాష్ట్రంలో కరెంట్ కోతల గురించి కాదని.. పొలిటికల్ పవర్ లేదని ఆయన అసలు బాధ అని అన్నారు.కేసీఆర్ కుటుంబానికి ప్రజలు పొలిటికల్ పవర్ కట్ చేశారని ఎద్దేవ చేశారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ మాటను ఇక నమ్మరన్నారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో సెక్రటేరియట్‌లో కేసీఆర్ ఎప్పుడైనా ప్రజలకు అందుబాటులో ఉన్నారా అని ప్రశ్నించారు. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీ సీట్లు గెలిస్తే రాహుల్ గాంధీ భారత ప్రధాని అవుతారని జగ్గారెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news