తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగులకు కేసీఆర్‌ శుభవార్త

-

తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగులకు కేసీఆర్‌ శుభవార్త. విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణపై వచ్చే నెల 3న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే లోగా ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకునేలా కృషి చేస్తానని జెన్కో సిఎండి దేవులపల్లి ప్రభాకరరావు తెలిపారు.

పి ఆర్ సి అమలు కోరుతూ టీ జాక్ ఎలాంటి ఆందోళన కార్యక్రమాలను చేపట్టవద్దని ఆయన సూచించారు. పిఆర్సి అమలు చేయాలని టీజాక్ నేతలు బుధవారం ఆయనను కలిసి విన్నవించగా పై విధంగా స్పందించారని టీ జాక్ చైర్మన్ ప్రకాష్ కన్వీనర్ శివాజీ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news