రాజ్​భవన్​లో పలువురు ప్రముఖులకు గవర్నర్ సన్మానం

-

తెలంగాణ రాజ్‌భవన్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్‌భవన్‌లో జరిగిన గణతంత్ర వేడుకల్లో సీఎస్‌ శాంతికుమారి పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగించారు.

ప్రసంగం అనంతరం గవర్నర్ తమిళిసై పలువురిని సన్మానించారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, లిరిసిస్ట్ చంద్రబోస్, బాలలత, ఆకుల శ్రీజను సత్కరించారు. సన్మానం అనంతరం కీరవాణి మాట్లాడుతూ.. పద్మశ్రీ అవార్డు దక్కడం చాలా ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. భగవంతుని ఆశీర్వాదం, ప్రజల అభిమానంతోనే పద్మశ్రీ వచ్చిందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news