BREAKING : ముంబై బయలుదేరిన కెసిఆర్..కాసేపట్లోనే ఉద్ధవ్ థాక్రేతో సమావేశం

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు… ముంబై బయలుదేరారు. కాసేపటి క్రితమే ప్రత్యేక విమానంలో ముంబై బయలుదేరారు సీఎం కేసీఆర్. ఈ నేపథ్యంలోనే బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్… ప్రత్యేక విమానంలో ముంబై బయలుదేరారు.

మధ్యాహ్నం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేతో టిఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సమావేశం కానున్నారు. ఇంకా సీఎం కేసీఆర్తో పాటు రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, జోగినిపల్లి సంతోష్ కుమార్, ముంబై వెళ్తున్నారు.

ఇక ఇవాళ సాయంత్రం నాలుగు గంటల సమయంలో… ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ లతో… దేశ రాజకీయాలపై సీఎం కేసీఆర్ చర్చించనున్నారు. ఇక ఈ రెండు సమావేశాల అనంతరం.. తిరిగే హైదరాబాద్ రానున్నారు సీఎం కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news