పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారిని కేసీఆర్ కాపాడుతున్నాడు: బండి సంజయ్

-

పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారిని కేసీఆర్ కాపాడుతున్నాడు అంటూ తెలంగాణా బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేసారు. వరద సాయంపై నాయకుల నుంచి ఎలాంటి లేఖ అందలేదని‌ ఎస్ఈసీ స్పష్టం చేశారని ఆయన పేర్కొన్నారు. పాతబస్తీలో కరెంట్ బిల్లులు వసూలు చేసినప్పుడే‌‌ .. ప్రభుత్వానికి కేంద్రం నిధులిస్తోంది అని ఆయన వివరించారు. బీజేపీని సమర్థిస్తోన్న యువకులను చాలాన్ల పేర్లతో హింసిస్తున్నారని విమర్శించారు.

నిజంగా నేనే లేఖ రాసి ఉంటే.. ప్రభుత్వం నాపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? అని ప్రశ్నించారు. ఫోర్జరీ లేఖ గురించి నేను చేసిన ఫిర్యాదుపై పోలీసుల చర్యలు ఎందుకు తీసుకోవటం లేదు? అని నిలదీశారు. బీజేపీని టీఆర్ఎస్ కంట్రోల్ చేయలేదు.. ప్రజల కంట్రోల్లో మాత్రమే బీజేపీ ఉంటోందని ఆయన స్పష్టం చేసారు. సమాజంలో 80శాతం ఉన్న హిందువుల మనోభావాలే మాకు ముఖ్యం అని ఆయన వ్యాఖ్యలు చేసారు. భాగ్యలక్ష్మీ దేవాలయం గురించి టీఆర్ఎస్ నాయకులకు అవగాహన లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news