కట్నం అడుగుతే దవడ పలగొట్టండి : కేసీఆర్

-

ఈరోజు బిజెపి నేత మోత్కుపల్లి టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇతర రాజకీయ పార్టీలకు రాజకీయం అంటే ఒక గేమ్ అని…కానీ టిఆర్ఎస్ కు రాజకీయం అంతే ఒక టాస్క్ అని వ్యాఖ్యానించారు. మోత్కుపల్లి నర్సింహులు నాకు మంచి స్నేహితుడు అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా కేసీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

KCR-TRS
KCR-TRS

కల్యాణ లక్ష్మి పథకం తో ఆడబిడ్డలకు ఆర్థిక సాయం అందిస్తుంటే… పేదింటి అమ్మాయిలను పెళ్లి చేసుకునే వాళ్ళు కెసిఆరే లక్ష ఇస్తున్నడు… నువ్వు ఎంత ఇస్తావు చెప్పు అని అడుగుతున్నారని… ఈ విషయం తన దృష్టికి వచ్చిందని వ్యాఖ్యానించారు. అయితే అలా అడుగుతున్న వాళ్ళ దవడ పగలకొట్టాలని చెప్పా అన్నారు. పేదలకు పెళ్ళిళ్ళు చేయడం వల్ల అప్పుల పాలు అవ్వడం… ఇబ్బందులు రావడం ఉండకూడదనే ఈ పథకాన్ని తీసుకు వచ్చాను అని అన్నారు. మళ్లీ ఇలా అడగడం ఏంటి అంటూ కేసీఆర్ ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news