హుజూర్‌నగర్‌లో నేడు సీఎం కేసీఆర్ ఎన్నిక‌ల‌ ప్ర‌చారం..

-

ఈ నెల 21న ఉప ఎన్నిక జరగనున్న హుజూర్‌నగర్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ప్రచారం నిర్వహించనున్నారు. హుజూర్‌నగర్‌ను గులాబీ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీంతో సీఎం సభ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మధ్యాహ్నం ఒంటి గంటకు హుజూర్‌నగర్ గుట్ట సమీపంలో జరిగే బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగిస్తారు.

ఇప్పటికే నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నది. ఇక‌ మధ్యాహ్నం 12:30 గంటలకు కేసీఆర్ బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి హెలికాప్టర్‌లో హుజూర్‌నగర్ చేరుకుంటారు. బహిరంగ సభ అనంతరం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశం అవుతారు. అనంతరం రాత్రి అక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news