మతాల మధ్య బీజేపీ నేతలు చిచ్చు పెడుతున్నారు: సీఎం రేవంత్ రెడ్డి

-

జూన్ 9న ఢిల్లీలో మువ్వన్నెల జెండా ఎగరాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ‘ బీఆర్ఎస్ ను తుక్కుతుక్కుగా ఎలా ఓడించామో.. బీజేపీని అలాగే ఓడించాలి అని కోరారు. ఇదే పట్టుదలతో పని చేయాలి. గుజరాత్ మోడల్ మీద వైబ్రెంట్ తెలంగాణ ఆధిపత్యం చూపిస్తుంది అంటూ విమర్శించారు. మతాల మధ్య బీజేపీ నేతలు చిచ్చు పెడుతున్నారు అని మండిపడ్డారు. తెలంగాణ మునిగినప్పుడు సిగ్గులేని కిషన్ రెడ్డి కేంద్రం నుంచి రూపాయి కూడా తేలేదు. అందుకే బీజేపీకి ఓటేయాలా?’ అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

ఇక మాజీ సీఎం కేసిఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ విరుచుకుపడ్డారు. ‘నిన్న మొన్న ఓ నక్క బయల్దేరింది. మొన్న సూర్యాపేట, నిన్న కరీంనగర్ పోయింది. కాంగ్రెస్ నేతలు నా వెంట్రుక కూడా పీకలేరని కేసీఆర్ మాట్లాడారు అని అన్నారు. అడవి పందిలాగా పదేళ్లు తెలంగాణను సర్వనాశనం చేశావ్ అని విమర్శించారు. నీ కాలు విరిగిందని, కూతురు జైలుకు వెళ్లిందని సంయమనం పాటించా. నేను జానారెడ్డిని కాదు రేవంత్ రెడ్డిని అని వార్నింగ్ ఇచ్చారు . మా కార్యకర్తలతో జాగ్రత్తగా ఉండాలి’ అని రేవంత్ హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news