రాజ్ నాథ్, మోదీతో సీఎం కేసీఆర్ భేటీ

-

పలు కీలకాంశలపై చర్చ

పాత చిత్రం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ఉదయం 11.30 గంటలకు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ కానున్నారు. అనంతరం సాయంత్రం 4.10 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, కొత్త జోన్ల ఏర్పాటుకు ఆమోదంతో పాటు, రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు , పెండింగ్ లో ఉన్న అంశాలపై కేసీఆర్ ప్రధానంగా చర్చించనున్నారు.

ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం కొంత మంది జాతీయ నేతలను కలవనున్నట్లు సమాచారం. ముందస్తు ఎన్నికల విషయంపై కూడా ప్రధానితో చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.  సీఎం కేసీఆర్ శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news