కేదార్‌నాథ్-బద్రీనాథ్ టూర్ ప్యాకేజీ… ఈ ప్రదేశాలన్నీ చూసి వచ్చేయచ్చు…!

-

ఈ వేసవిలో ఓ మంచి టూర్ వెయ్యాలని ఉందా..? అయితే ఈ టూర్ ప్యాకేజీ గురించి చూడాల్సిందే. IRCTC భక్తుల కోసం రెండు ధామ్ టూర్ ప్యాకేజీలని తీసుకు రావడం జరిగింది. ఈ టూర్ ప్యాకేజీ ద్వారా భక్తులు కేదార్‌నాథ్, బద్రీనాథ్ ధామ్‌లను సందర్శించవచ్చు. ఇక ప్యాకేజీ గురించి పూర్తి వివరాలు చూస్తే.. భక్తులకు వచ్చే నెలలో కేదార్‌నాథ్ , బద్రీనాథ్ దర్శనం ఉంటుంది. ఈ ప్యాకేజీ తో వీటిని చుట్టేసి రావచ్చు.

IRCTC దో ధామ్ ఎక్స్ అని దీన్ని అంటారు. IRCTC ఈ టూర్ ప్యాకేజీ జూన్ 1 నుండి ప్రారంభించనుంది. 24 మంది భక్తులు దర్శనం చేసుకోవడానికి అవుతుంది. ఏడు రాత్రులు ఎనిమిది రోజుల ప్యాకేజీ ఇది. భక్తులకు వసతి మరియు భోజనాన్ని కూడా ఈ టూర్ ప్యాకేజీ తో వస్తుంది. భక్తులకు ఉచిత అల్పాహారం, రాత్రి భోజనంని ఈ ప్యాకేజీ తో ఇస్తారు. అలానే యాత్రికులకు ఏసీ బస్సు సౌకర్యం ఉంటుంది.

భక్తులకు ప్రయాణ బీమా సౌకర్యాన్ని కూడా ఇస్తారు. ఈ ప్యాకేజీకి మీరు ఒంటరిగా ప్రయాణించడానికి ఒక్కొక్కరికి రూ. 69, 100 ఖర్చు అవుతుంది. అదే ఒకవేళ ఇద్దరు అయితే ఒక్కొక్కరికి రూ.48,800, ముగ్గురితో ప్రయాణిస్తే రూ.46,300 మీరు పే చెయ్యాల్సి వుంది. ఇది ఇలా ఉంటే IRCTC వివిధ టూర్ ప్యాకేజీలను ఇస్తోంది. వీటి ద్వారా ప్రయాణికులు దేశంలో మరియు విదేశాలలో ప్రయాణించవచ్చు. IRCTC అధికారిక వెబ్ సైట్ లో పూర్తి వివరాలు చూడచ్చు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news