Keerthy Suresh: పుష్ప రాజ్ తో రొమాన్స్ చేయ‌నున్న మహానటి?

-

Keerthy Suresh: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ .. ప్ర‌స్తుతం పుష్ప సినిమాతో చాలా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మాస్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం రెండు పార్టులుగా రాబోతున్నది. పాన్ ఇండియా చిత్రంగా తెర‌కెక్కిన ఈ చిత్రంలో అల్లు అర్జున్ మాస్ లుక్ అందరికి షాకింగ్ గా ఉన్న విషయం తెల్సిందే. తొలి భాగం డిసెంబ‌ర్ 17న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది.

అయితే.. పుష్ప పార్ట్ 1 తర్వాత వెంటనే పార్ట్ 2ను ప్రారంభించ‌నున్నర‌ని తొలుత వార్త‌లు వ‌చ్చాయి. కానీ,
కాస్త విరామం పెట్టి.. మద్యలో మ‌రో సినిమాకు గ్రీన్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. అదికూడా స‌క్సెస్ పుల్ డైరెక్ట‌ర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో భారీ బ‌డ్జెట్ సినిమా చేయబోతున్నట్లుగా తాజా సమాచారం. ఇప్ప‌టికే ఈ సినిమా కోసం బ్యాకెండ్ వర్క్ కూడా మొదలు పెట్టారని ప్రచారం జరుగుతుంది.

త్వ‌ర‌లోనే బోయపాటి మాస్ స్క్రిప్ట్ తో సెట్ పైకి రానున్న‌ట్టు మెగా అభిమానులు చెప్పుకుంటున్నారు. గతంలో బ‌న్నీ, బోయ‌పాటిల కాంబోలో తెర‌కెక్కిన సరైనోడు సినిమా ఎలాంటి హిట్ సాధించిందో చెప్ప‌వ‌ల్సిన అవ‌స‌రం లేదు. మ‌రో బన్నీలో మాస్ యాంగిల్ ను బయటపెట్టేలా.. ఈ సినిమా
తెర‌కెక్కుతున్న‌ట్టు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే.. మాస్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ స‌ర‌స‌న మహానటిని ఎంపిక చేసుకున్నట్లు మరో కథనం ఫిల్మ్ న‌గ‌ర్ లో చ‌క్క‌ర్లు కొడుతుంది. ప్రస్తుతం కీర్తి తెలుగులోనే కాకుండా.. తమిళ, మలయాళ భాషల్లో వరుస చిత్రాలు చేస్తూ చాలా బిజీగా బిజీగా మారింది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది ఈ భామ.
అలాగే మ‌రో వైపు భోళా శంకర్ లో మెగాస్టార్ కు చెల్లిగా మారింది. ఇలా చిన్న హీరోలు పెద్ద హీరోలు అని తేడా లేకుండా వ‌రుస‌గా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది ఈ మ‌హాన‌టి.

Read more RELATED
Recommended to you

Latest news