మనిషేనా వీడు..? మేకపై హత్యాచారం…కేరళలో ఘటన

-

కామాంధులు ఎంతటి దారుణాలకైనా తెగిస్తున్నారు. పశువల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. జంతువులను కూడా వదలడం లేదు. ఇలాంటి ఘటనే కేరళలో చోటు చేసుకుంది. కాసర్ గోడ్ జిల్లాలో ఓ కామాంధుడు మేకపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అప్పటికే గర్భంతో ఉన్న మేకపై అసహజ రీతిలో రేప్ చేశాడు. చివరకు మేక చనిపోవడానికి కారణం అయ్యాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే ఓ హోటల్ లో పనిచేసే సెంథిల్ అనే యువకుడు మేకపై అత్యాచారం చేసినట్లుగా పోలీసులు నిర్థారించారు. అతన్ని అరెస్ట్ చేశారు. హోటల్ యాజమాన్యం చెప్పిన వివరాల ప్రకారం… మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో హోటల్ వెనక ఉన్న మేక భయంకర అరుపును వినిపించాయని… సిబ్బంది మేలుకొని వెళ్లి చూసే సరికి మేక తీవ్ర రక్తస్త్రావంతో ఉందని.. ఆసమయంలో సెంథిల్ అక్కడ నుంచి పారిపోవడం చూశామని చెప్పారు. సెంథిల్ దాదాపు రెండేళ్లుగా సదరు హోటల్ లో పని చేస్తున్నాడు.

శవపరీక్ష నిర్వహించిన ప్రభుత్వ వెటర్నరీ సర్జన్ ప్రాథమిక నివేదికలో మేక అసహజ సెక్స్‌కు గురైనట్లు తేలిందని…హోస్‌దుర్గ్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) తెలిపారు. అయితే సెంథిల్ తో పాటు మరో ఇద్దరు ఈ ఘటనలో ప్రమేయం ఉన్నట్లు హోటల్ యాజమాన్యం ఆరోపించినా.. సెంథిల్ ఒక్కడే నేరాని పాల్పడ్డాడని పోలీసులు ధ్రువీకరించారు.

Read more RELATED
Recommended to you

Latest news