నేషనల్ అవార్డ్ డైరెక్టర్ తో కేజిఎఫ్ హీరో!

-

రాఖీ భాయ్ గా దేశవ్యాప్తంగా ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయారు హీరో యశ్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న కేజిఎఫ్ దేశంలోని అన్ని భాషల్లో రికార్డు స్థాయి కలెక్షన్లు కొల్లగొట్టింది. ఈ సినిమా తర్వాత సినిమా చేస్తాడు అనే ఆసక్తి అన్ని వర్గాల ప్రజల్లోనూ నెలకొంది. అతని లుక్, స్క్రీన్ ప్రెజెన్స్ కు తగ్గట్టుగా సినిమాలు నిర్మించేందుకు అనేక బడా నిర్మాణ సంస్థలు క్యూ కడుతున్నాయి. కానీ.. భారీ బడ్జెట్ కంటే కథకే ప్రాధాన్యత ఇస్తున్న రాకీ భాయ్.. ఆశ్చర్యకరంగా నేషనల్ అవార్డు విన్నర్, దర్శకురాలు గీతు మోహన్దాస్తో ఓ సినిమా చేసేందుకు అంగీకరించారని వార్తలు వస్తున్నాయి.

యష్, గీతు మోహన్దాస్ ఏడాది కాలంగా తమ సినిమా కథ విషయమై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. గీత చెప్పిన కథ యశ్ బాగా నచ్చినట్టుగా సమాచారం. ఈ సినిమాని మారికొన్ని రోజుల్లోనే ప్రకటించే అవకాశం వుంది. ఇందుకు సంబంధించిన చర్చలు ప్రస్తుతానికి చివరి దశకు చేరుకున్నాయి. ఓ పదిహేను రోజుల్లో ఫుల్ క్లారిటీ వస్తుందని విశ్వసనీయ వర్గాల టాక్.

 

నేషనల్ అవార్డ్ డైరెక్టర్ గీతు మోహన్దాస్ గీతు మోహన్ దాస్.. ‘లైయర్స్ డైస్, ది ఎల్డర్ వన్’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో లైయర్స్ డైస్.. ఇండియాలో 2 నేషనల్ అవార్డులు సహా అంతర్జాతీయంగా 6 అవార్డ్స్ గెలుచుకుంది. 87వ అకాడెమీ అవార్డ్స్ కోసం బెస్ట్ ఫారిన్ మూవీ కేటగిరీలో భారతదేశం నుంచి అధికారిక ఎంట్రీగా పంపబడింది. ఇక Yash19 మూవీ షూటింగ్ను జూన్లో ప్రారంభించి 2024 చివర విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, హోంబలే ఫిల్మ్స్ KGF3 ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం 1978-1981 మధ్య రాకీ భాయ్ కథను చిత్రీకరించే ఈ మూవీ.. ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉంది. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసే ఈ మూవీ 2025 సంవత్సరంలో ఎప్పుడైనా ప్రారంభించే అవకాశం ఉంది

Read more RELATED
Recommended to you

Latest news