కెసిఆర్ పాలనలో మళ్లీ నక్సలిజం వస్తుంది – షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యలు

-

మాజీ మంత్రి షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసిఆర్ పాలనలో మళ్లీ నక్సలిజం వస్తూందని.. మళ్లీ తుపాకీ పట్టే రోజులు వస్తాయని కీలక వ్యాఖ్యలు చేశారు. 30లక్షల మంది పేపర్ లీకేజి లో రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. 9 సంవత్సరాలలో నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు కానీ.. కేసిఆర్ కి చెందిన 40 మందికీ ఉద్యోగాలు వచ్చాయన్నారు.

అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రజాస్వామ్యంలో పని చేయటం లేదూ కానీ.. కేసిఆర్ రాసిన రాజ్యాంగ పని చేస్తుందన్నారు. పేపర్ లీకేజి లో ఇద్దరే ఇద్దరు అదికారులు ఉన్నారని కేటీఆర్ చెప్పారని… కానీ సిట్ తో విచారణ చేపిస్తామంటే మాకు నమ్మకం లేదన్నారు. సిటింగ్ జడ్జ్ తో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సమాజాన్ని లీకుల మయం చేశారని దుయ్యబట్టారు. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేశానని చెప్పడం కాదు.. కెసిఆర్ కి దమ్ముంటే దళితుడిని ముఖ్యమంత్రిని చేయాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news