బ్రేకింగ్ : హుస్సేన్ సాగర్ లో ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం పూర్తి

-

హుస్సేన్‌ సాగర్‌ లో ఖైరతాబాద్‌ గణనాథుడి నిమజ్జన కార్యక్రమం పూర్తి అయింది. హుస్సేన్‌ సాగర్‌ దగ్గర ఉన్న అధికారులు… ఎంతో జాగ్రత్త గా ఖైరతాబాద్‌ గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. అక్కడే ఏర్పాటు చేసిన…. క్రేన్‌ నెంబర్‌ 4 లో ఖైరాతాబాద్‌ మహా గణపయ్య ను నిమజ్జనం చేశారు.

ఇక నిమజ్జన కార్యక్రమాన్ని చూడటానికి భక్తులతో వేల సంఖ్య లో టాంక్‌ బండ్‌ కు చేరుకున్నారు. వర్షం పడుతున్నప్పటికీ ఖైరతాబాద్‌ విగ్రహాన్ని చూడటానికి భక్తులు అక్కడికి చేరుకున్నారు. దీంతో భక్తులతో ట్యాంక్‌ బండ్‌ కిక్కిరిసింది. కాగా…. హైదరాబాద్‌ నగరం లో ని పలు ప్రాంతా ల్లో… భారీ వర్షం కురుస్తోంది. ముఖ్యంగా చార్మినార్‌, శాలిబండ, ఫలక్‌ నామా, లాల్‌ దర్వాజ, చాంద్రయణ గుట్ట, యాఖత్‌ పురా, బహదూర్‌ పురా, అఫ్జల్‌ గంజ్‌ మరియు మొజంజాహీ మార్కెట్‌ పాటు ట్యాంక్‌ బండ్‌ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. చిరు జల్లుల మధ్య గణేష్‌ శోభయాత్ర విజయ వంతంగా కొనసాగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news