ఒక్కటి కాబోతున్న కియారా – సిద్ధార్థ.. మ్యారేజ్ వెన్యూ కూడా ఫిక్స్..!

-

గత కొన్ని రోజుల నుంచి బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ ప్రేమలో వుంది.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది అంటూ రకరకాల వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే కొన్నాళ్లుగా బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రాతో ఈమె పెళ్లికి సిద్ధమైంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బాలీవుడ్లో బాగా ఫేమస్ అయిన ఎన్నో ప్రేమ జంటలు వివాహం చేసుకొని ఒకటవుతున్న నేపథ్యంలో వీరు కూడా అదే దారిలో వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మ్యారేజ్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యారట. త్వరలోనే వీరు పెళ్లి ఉండబోతుందని సమాచారం. అంతేకాదు వీరి మ్యారేజ్ కి వెన్యూ కూడా ఫిక్స్ చేశారని ఇప్పుడు వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి.

డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం మొదట్లో గోవాలో వివాహం చేసుకోవాలనుకున్న వీరు ఇప్పుడు గోవా నుంచి చండీగర్ కి షిఫ్ట్ అయ్యారట. సిద్ధార్థ ఫ్యామిలీ సాంప్రదాయం ప్రకారమే వీరి పెళ్లి జరుగుతుందని సమాచారం. సిద్ధార్థ – కియారాలు కలిసి షేర్షా సినిమాలో నటించారు. అప్పటినుంచి వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి..ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. కాబట్టి మొత్తానికి మరో బాలీవుడ్ హీరోయిన్ కూడా పెళ్లికి రెడీ అవుతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కేవలం కొద్దిమంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలోనే సిద్ధార్థ మల్హోత్రా – కియారాల పెళ్లి జరుగుతుందని సమాచారం.

అయితే ఇప్పటికే వెన్యూ ఫిక్స్ చేసినప్పటికీ పెళ్లి డేట్ ఎప్పుడు అన్నది మాత్రం ఇంకా ఖరారు చేయలేదు. కియారా హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్నప్పుడే పెళ్లి ఏంటి అని కొంతమంది అంటున్నా.. నచ్చినవాడు దొరికినప్పుడు వివాహం చేసుకుంటే తప్పేముంది అంటూ మరి కొంతమంది చెబుతున్నారు. ఏది ఏమైనా వీరిద్దరు త్వరలోనే వివాహం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news