హైదరాబాద్ లో కిడ్నాప్ కలకలం.. బురఖా వేసుకొచ్చి మరీ!

-

రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో డాక్టర్ కిడ్నాప్ కలకలం రేపుతోంది. బుర్కా వేసుకొని వచ్చి డాక్టర్ ను కార్ లో ఎక్కించుకు ని గుర్తుతెలియని వ్యక్తులు తీసుకు వెళ్లారు. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమయత్ సాగర్ దర్గా వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. హిమాయత్సాగర్ సమీపంలోని ఎక్సైజ్ అకాడమీ ప్రక్కనున్న డాక్టర్ ని ఆయన అపార్ట్మెంట్ నుండి తీసుకు వెళ్ళారు గుర్తుతెలియని దుండగులు.

బెహజాట్ హుసాన్ (57) అనే డాక్టర్ ని కార్ నెంబర్ AP9 Y 0031 లో తీసు కెళ్ళారు. దీంతో ఆ డాక్టర్ కుటుంబం రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలు లేదంటే వ్యాపార లావాదేవీల్లో కారణంగా డాక్టర్ ని కిడ్నాప్ చేసి తీసుకు వెళ్ళారా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news