భార్యకు భరణమిచ్చేందుకు కిడ్నీ అమ్మేస్తా.. బ్యానర్​తో రోడ్లపై భర్త హల్​చల్​

-

పెళ్లి చేసుకున్నంత ఈజీ కాదు విడాకులు తీసుకోవడమంటే. ఒకవేళ తీసుకున్నా.. భార్యకు భరణం చెల్లించుకోవాల్సిందే. ఇలా భార్యకు భరణం ఇచ్చి చాలా మంది సంపన్నుల తమ ఆస్తిని సగం కోల్పోయారు. తాజాగా ఓ వ్యక్తి తన భార్యకు భరణం ఇచ్చేందుకు కిడ్నీ అమ్మేయడానికి రెడీగా ఉన్నానని.. ఒకవేళ అలా చేసినా డబ్బు సమకూరకపోతే ఆత్మహత్య చేసుకుంటానని రాసి ఉన్న బ్యానర్​తో రోడ్డుపై హల్​చల్ చేశాడు. ఈ ఘటన హరియాణాలోని ఫరీదాబాద్​లో చోటుచేసుకుంది.

‘కిడ్నీ విక్రయానికి సిద్ధంగా ఉంది’, ‘మార్చి 21న ఆత్మాహుతి కార్యక్రమం’ ఇదీ హరియాణాలోని ఫరీదాబాద్‌లో ఓ వ్యక్తి పట్టుకున్న బ్యానర్‌కు రెండు వైపులా ఉన్న సమాచారం. బిహార్‌ రాజధాని పట్నాకు చెందిన సంజీవ్‌కు ఆరేళ్ల క్రితం వివాహమైంది. భార్య, బావమరిది, అత్తమామల నుంచి వేధింపులు రోజురోజుకు పెరిగిపోయాయి. విడాకులు కావాలంటే రూ.10 లక్షలు ఇవ్వాలని తన భార్య డిమాండ్‌ చేస్తోందని సంజీవ్‌ వాపోయాడు. సాయం చేయాల్సిందిగా పోలీసులు, అధికారులను అనేకమార్లు సంప్రదించిన తర్వాతే విసిగిపోయి ఇలా బ్యానర్‌తో తిరుగుతున్నానని, 21 లోగా కిడ్నీ విక్రయిస్తే ఆ డబ్బులు తన భార్యకు ఇస్తానని చెప్పాడు.

ఒకవేళ విక్రయించలేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని పేర్కొన్నాడు. ఈ మేరకు 21న పట్నాలో ఆత్మాహతి కార్యక్రమం ఉంటుందని, ఆ కార్యక్రమానికి హాజరు కావాలంటూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్‌ల పేర్లను సైతం బ్యానర్‌పై ఒకవైపు ముద్రించాడు.

Read more RELATED
Recommended to you

Latest news