బెట్టింగ్ డబ్బులు 2 వేల కోసం అమ్మాయిని చంపేసాడు…!`

-

ఐపిఎల్ వచ్చింది అంటే క్రికెట్ బెట్టింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది. పోలీసులు అప్రమత్తంగా ఉన్నా సరే ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా పశ్చిమ గోదావరి లింగ పాలెం మండలంలో ఒక ఘటన చోటు చేసుకుంది. క్రికెట్ బెట్టింగ్ లో 2 వేల కోసం బాలికను చంపేసాడు. తోచలకరాయుడి పాలెం గ్రామంలో 8 ఏళ్ల బాలిక ఇటీవల హత్యకు గురైంది.

crime
crime

ఈ కేసులో విచారణ చేసిన పోలీసులు… హత్య కేసులో ప్రధాన నిందితుడు బన్ను ను అదుపులోకి తీసుకున్నారు. క్రికెట్ బెట్టింగ్ లో 2 వేల రూపాయలు అప్పు చేసిన బన్ను… ఆ అప్పు తీర్చడానికి బాలిక చెవి దుద్దులు అపహరించే క్రమంలో హత్య చేసాడు అని పోలీసులు పేర్కొన్నారు. ఐపిఎల్ బెట్టింగ్ లకు పాల్పడుతూ ఉంటాడని, ఈ క్రమంలోనే తెలిసిన వాళ్ళ దగ్గర అతను అప్పులు చేస్తాడు అని పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news