మహారాష్ట్రలో ఘోర పడవ ప్రమాదం..పలువురు గల్లంతు.

-

మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో విషాదం నెలకొంది. జనాలతో వెళ్తున్న రెండు పడలు ఇంద్రావతి నదిలో బోల్తా పడ్డాయి.. ఈ ప్రమాదంలో పలువురు గల్లంతు అయ్యారు..ప్రమాదం నుంచి 13 మందిని స్థానికులు రక్షించారు.వీరందరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు..చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు..అయితే గల్లంతు అయినా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి..గల్లంతు అయినా వారు సిరోంచ తాలూక సోమనపల్లి వాసులుగా గుర్తించారు.

అయితే సామర్థ్యానికి మించి పడవలో జనాలు ఎక్కడంతోనే ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు..ప్రమాదం జరిగిన సమయంలో పడవలో సుమారు 40 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news