ఐసోలేషన్‌ లో కింగ్‌ నాగార్జున..గోవాకు తరలింపు !

-

బంగార్రాజు ప్రొడక్షన్‌ టీం లో ఎక్కువ మంది కరోనా బారీన పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో…అక్కినేని నాగార్జున కీలక నిర్ణయం తీసుకున్నారు. తన తో పాటు ఫ్యామిలీలోని సభ్యులను ఐసోలేషన్‌ కు తరలించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే.. నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అక్కినేని నాగార్జున కుటుంబం… అక్కడి నుంచి నేరుగా గోవాకు వెళ్లింది.

అక్కడే సెల్ఫ్‌ ఐసోలేషన్‌ ఉండేలా కింగ్‌ నాగార్జున అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. దీంతో స్పెషల్‌ ప్లైట్‌ లో అక్కినేని నాగార్జున ఫ్యామిలీ గోవాకు చెక్కేసింది. కాగా.. అక్కినేని నాగార్జున , అక్కినేని నాగా చైతన్య కలిసి నటించిన బంగార్రాజు సినిమా సంక్రాంతి కానుకగా..జనవరి 14 వ తేదీన విడుదలైంది. విడుదల కాగానే హిట్‌ టాక్‌ రావడంతో… బంగార్రాజు సినిమా కలెక్షన్ల సునామీ కురిపిస్తుంది. ఇప్పటికే బంగార్రాజు సినిమా రూ. 100 కోట్ల క్లబ్‌ లో చేరినట్లు టాక్‌ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా కూడా త్వరలోనే ఓటీటీలో  విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news