ఏపీలో కరోనా టెర్రర్‌..ఒకే పాఠశాలలో 147 మందికి పాజిటివ్‌

-

ఏపీలో కరోనా టెర్రర్‌ సృష్టిస్తోంది. ప్రతి రోజూ ఏపీలో 13 వేలకు పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. అయితే.. అటు ప్రకాశం జిల్లాలోని పాఠశాలల్లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. తాజాగా 54 మంది ఉపాద్యాయులు, 18 మంది విద్యార్థులు, నలుగురు నాన్ టీచింగ్ స్టాఫ్ కు పాజిటివ్ గా నిర్ధారణ అయింది.. సంక్రాంతి సెలవుల అనంతరం గత ఐదు రోజుల్లో మొత్తం 147 మందికి ఆ పాఠశాలలో కరోనా వైరస్‌ సోకింది.

నిన్న జిల్లా వ్యాప్తంగా నమోదైన 772 కరోనా కేసుల్లో పాఠశాలల్లోనే 10 శాతం కేసులు నమోదు అయ్యాయి. రోజు రోజుకూ పాఠశాలల్లో భారీగా నమోదవుతున్న కేసులతో ఉపాద్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంటుంది.. కరోనా వైరస్‌ ఉధృతి తగ్గే వరకు పాఠశాలలకు తాత్కాలికంగా సెలవులు ప్రకటించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కాగా.. కరోనా కేసులు పెరిగినప్పటికీ… పాఠశాలలు నడుపుతామని… ఏపీ సర్కార్‌ చెబుతోంది. కరోనా కేసులు వస్తే.. శానిటైజర్ వాడి…పాఠశాలలు నడపాలని చెబుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news