KINGS CUP : సెమీస్ లో ఓడి ఇంటిబాట పట్టిన ఇండియా … !

-

ఇండియన్ ఫుట్ బాల్ జట్టు ఈ సంవత్సరం ఎన్నడూ లేనంత అద్భుతమైన ఫామ్ లో ఉంది. ఈ సంవత్సరం సునీల్ ఛెత్రి సారధ్యంలో ఆడిన అన్ని ఫుట్ బాల్ టోర్నమెంట్ లలో ఇండియా ఫైనల్ చేరడం విశేషం. కానీ ప్రస్తుతం థాయిలాండ్ లో జరుగుతున్న కింగ్స్ కప్ టోర్నమెంట్ లో భాగంగా జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో అనూహ్యంగా ఇండియా ఓటమి పాలవ్వడం ఫ్యాన్స్ అందరినీ చాలా బాధకు గురి చేస్తోంది. ఇరాక్ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో రెండు జట్లు నిర్ణీత సమయంలో 2 – 2 గోల్స్ తో సమంగా నిలిచాయి. ఇక విజేతను ఎంపిక చేయడానికి అంపైర్లు మ్యాచ్ ను పెనాల్టీ షూట్ అవుట్ ను పెట్టడం జరిగింది.

ఈ షూట్ అవుట్ లో ఇండియా కన్నా ఇరాక్ ఒక గోల్ ఎక్కువ చేయడంతో సెమీఫైనల్ లోనే సునీల్ ఛెత్రి టీం ఇంటి ముఖం పట్టాల్సి వచ్చింది. కాగా ఈ సీజన్ మొత్తానికి ఇండియా ఫైనల్ కు చేరకపోవడం ఇదే మొదటిసారి.

Read more RELATED
Recommended to you

Latest news