కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి తలకు గాయం

-

విజయవాడ : కేంద్ర టూరిజం శాఖ మంత్రి కిషన్ రెడ్డి.. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించిన సంగతి తెలిసిందే. జన ఆశీర్వాద యాత్ర పేరుతో ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ కిషన్ రెడ్డి పర్యటించారు. అయితే ఈ జన ఆశీర్వాద యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి ఊహించని పరిణామం ఎదురైంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తలకు గాయం అయింది. ఆశీర్వద సభ ముగించుకొని దుర్గ గుడికి వెళ్లేందుకు కారు ఎక్కుతుండగా కిషన్ తలకు బలంగా పగిలింది కారు డోర్.

దీంతో కిషన్ రెడ్డి కి బలంగా తలకు గాయం అయింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. అయితే ఈ గాయం అయినప్పటికీ కూడా ఆయన తన యాత్రను కొనసాగించడం గమనార్హం. కాగా ఇవాళ తిరుపతి లో యాత్ర ముగించుకుని కిషన్ రెడ్డి… తెలంగాణ రాష్ట్రంలో మొదలు పెట్టనున్నారు. ఇవాళ సాయంత్రం సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఈరోజు రాత్రి సూర్యాపేట జిల్లా లోని కిషన్రెడ్డి బస చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news