ఎన్ని లక్షల ఇళ్ళు కట్టినా కేంద్రం సాయం తెచ్చే పూచీ నాది !

-

ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ తో కలసి ముషీరాబాద్ నియోజకవర్గంలో జరుగుతోన్న డబుల్ బెడ్రూం ఇళ్ళను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని లక్షల ఇళ్ళు కట్టినా కేంద్రం వాటాను తీసుకొచ్చే బాధ్యత నాదేనని అన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ళ నిర్మాణంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమయిందని అన్నారు. ఇక లబ్ధిదారులు కిషన్ రెడ్డిని కలసి ఇళ్ళ నిర్మాణంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు.

2015 లో శంకుస్థాపన చేసిన ఇంటి నిర్మాణాలు పూర్తికాకపోవటం ప్రభుత్వ చేతకాని తనమన్న ఆయన ఎన్నికల‌ కోసం టీఆర్ఎస్ డబుల్ బెడ్రూం ఇళ్ళను వాడుకుంటోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇళ్ళ కోసం ఇచ్చిన నిధులను పక్కదోవ పట్టించారన్ అన్నారు. కేంద్ర నిధులతో ఆంద్రప్రదేశ్లో 7లక్షల ఇండ్లు పూర్తి చేశారన్న ఆయన హైదరాబాద్ లో దాదాపు 20లక్షల మందికి పేదలకు ఇండ్లు లేవని అన్నారు. అందరికీ ఇండ్లు నిర్మిస్తే కేంద్ర ప్రభుత్వం వాటా ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లకు మౌలిక సదుపాయాలు  యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని ఆయన కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news