బాలీవుడ్ హీరో కూతురితో టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ పెళ్లి ఫిక్స్..!

-

బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టి.. టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారనే పుకార్లు వస్తున్న సంగతి తెలిసిందే. మొదట్లో కాస్త సీక్రెట్ గా వీళ్ల రిలేషన్ ను మెయింటైన్ చేసిన ఈ జంట తర్వాత తర్వాత పబ్లిక్ గా తమ ప్రేమను చూపించడం మొదలుపెట్టారు.

అలా సోషల్ మీడియాలోనూ పలుమార్లు ఈ లవ్ బర్డ్స్ ఒకరిపై ఒకరు ప్రేమను చాటుకున్నారు. చాలాసార్లు కలిసి వెకేషన్స్ కు కూడా వెళ్లారు. ఇరువురి ఫ్యామిలీస్ కూడా చాలాసార్లు కలిశాయి. ఇక పెళ్లి ఒకటే లేటు అనుకుంటున్న సమయంలో త్వరలో పెళ్లి అంటూ పుకార్లు మొదలయ్యాయి.

అయితే ఇప్పుడు అతియా-రాహుల్ జంటకు సంబంధించి ఓ క్రేజీ న్యూచ్ తెలిసింది. తాజాగా ఈ జంట త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నట్లు తెలుస్తోంది. రాహుల్‌-అథియా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ బాలీవుడ్‌లో గట్టిగా టాక్‌ వినిపిస్తోంది. జనవరి 23వ తేదీన వీరి వివాహం సునీల్‌ శెట్టి నివాసం ఖండాలాలో జరగనున్నట్లు తెలుస్తోంది. జనవరి 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ వివాహ వేడుకలు నిర్వహించనున్నట్లు సమాచారం.

ఈ వివాహ వేడుకకు అతి కొద్ది మంది కుటుంబ సభ్యులు, సినీ ఇండస్ట్రీ నుంచి సల్మాన్‌ ఖాన్‌, అక్షయ్‌ కుమార్‌, జాకీ ష్రూఫ్‌ తదితరులు మాత్రమే హాజరవుతున్నట్లు సమాచారం. అదేవిధంగా క్రీడా రంగం నుంచి ధోనీ, కోహ్లీ వంటి స్టార్‌ క్రికెటర్లు హాజరవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

 

Read more RELATED
Recommended to you

Latest news