పనిపై సిటీకి వెళ్లిన భర్త, అర్ధరాత్రి కోడలి గదిలోకి మామయ్య, ఆ తర్వాత! 

-

మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లోని శివపురి లింకు రోడ్డు నివాసి 26 ఏళ్ల మౌనికకు, 2018లో పెద్దల సమక్షంలో చంద్రవదని నివాసి రాజుతో వివాహం జరిగింది. కొద్ది రోజులపాటు వీరికి కాపురం సవ్యంగానే సాగింది. ఆ తర్వాత వీరి మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. అయితే పరిస్థితులు చక్కబడతాయని ఉద్దేశంతో మౌనిక అత్తవారింటిలోనే ఉంటుంది.

రెండు రోజుల క్రితం మౌనిక భర్త రాజు ఇంటి నుంచి పనిమీద బయటకు వెళ్ళాడు. దీంతో ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంది. అర్ధరాత్రి సమయంలో ఆమె మామ జ్ఞానేశ్వర్ కోడలు ఉంటున్న గదిలోకి వచ్చాడు. ఆ సమయంలో మామ రావడంతో కంగారుపడిన ఆమె ఎందుకు వచ్చారని అడిగింది. అయితే అతను ఆమె మాట పట్టించుకోకుండా ఆమెపై అత్యాచారం జరిపాడు.

ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే బాధితురాలు ఈ విషయాన్ని తన పుట్టింటి వారికి చెప్పింది. దీంతో వారు బాధితురాలి ఇంటికి చేరుకొని ఆమె మామపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Latest news