కవిత ఫస్ట్ వికెట్ పడింది – విజయశాంతి

-

కవిత ఓపెనింగ్ వికెట్ పడబోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ విజయశాంతి.లిక్కర్ స్కామ్ ను కప్పిపుచ్చుకునేందుకే దాడులకు తెగబడుతున్నారనీ…టిఆర్ఎస్ బండారం యావత్ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని వెల్లడించారు. బీజేపీ కార్యకర్తలు కేసులకు భయపడరు… మునుగోడు లో బిజేపీ గెలవబోతుందన్నారు మాజీ ఎంపీ విజయశాంతి.

దేశంలో జరుగుతున్న అత్యంత అవినీతిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమేయం ఉందని, ఎమ్మెల్సీ కవిత దిల్లీలో లిక్కర్ పాలసీకి సంబంధించిన సమావేశాలు నిర్వహించిందన్నారు విజయశాంతి.

అవినీతిలో పూర్తిగా కూరుకుపోయింది కవిత అని, పంజాబ్ రైతుల పేరుతో కేసీఆర్ పర్యటనలు చేశారన్నారు. కవిత విషయంలో కేటీఆర్ ఏమీ మాట్లాడుతలేరని, ఫీనిక్స్ పైన సీబీఐ దాడులు జరుగుతున్నాయన్నారు. కేటీఆర్ బాగోతం కూడా బయటకు వస్తుందని, ముఖ్యమంత్రి కుటుంబం మొత్తం ఈడీ, సీబీఐలో ఇరుక్కుపోయారన్నారని ఆరోపణలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news