బాబు, లోకేష్ లకు నార్కో అనాలిసిస్ చేస్తే నిజాలు బయటకొస్తాయి !

-

చంద్రబాబు అంటేనే అంతెత్తున లేచే ఏపీ మంత్రి కొడాలి నాని రామతీర్థం దేవస్థానం అంశం పై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు, టిడిపి నాయకుల పై మండిపడ్డ మంత్రి కొడాలి నాని, రామతీర్థంలో నూటికి నూరుశాతం విగ్రహాన్నీ ధ్వంసం చేయించింది చంద్రబాబేనని అన్నారు. చంద్రబాబుతో పాటు, లోకేష్, అశోక్ గజపతిరాజు, స్థానిక టిడిపి నాయకులకు నాల్కో ఎనాలసిస్ పరీక్షలు చేయిస్తే నిజాలు బయట పడతాయని ఆయన అన్నారు.

దేవుడు లాంటి ఎన్టీఆర్ కే వెళ్లి పోటు పొడిచిన చంద్రబాబు కు, దేవుడు అన్నా, ప్రజాస్వామ్యం అన్నా నమ్మకం లేదని అన్నారు. స్వార్థ రాజకీయాల కోసమే విజయనగరం జిల్లా రామతీర్థం లో చంద్రబాబు డేరా బాబా అవతారం ఎత్తారని మంత్రి కొడాలి నాని విమర్శించారు. ఇక అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో గుళ్ళను కూల్చి, చెత్త ట్రాక్టర్లలో దేవుళ్ళ విగ్రహాలను డంపింగ్ యార్డ్ ల్లో పడేసిన చరిత్ర చంద్రబాబుదన్న అయన అధికారంలో ఉన్నప్పుడు పగలు, లేనప్పుడు రాత్రివేళల్లో చంద్రబాబు గుల్లపై పై దాడులు చేస్తున్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news