ఐపీఎల్ 35వ మ్యాచ్‌.. హైద‌రాబాద్ టార్గెట్ 164..

-

అబుధాబిలో జ‌రుగుతున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2020 టోర్నీ 35వ మ్యాచ్‌లో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్‌పై కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ 163 ప‌రుగుల స్కోరు చేసింది. మ్యాచ్‌లో హైద‌రాబాద్ జ‌ట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా కోల్‌క‌తా బ్యాటింగ్ చేప‌ట్టింది. ఈ క్ర‌మంలో కోల్‌క‌తా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల‌ను కోల్పోయి 163 ప‌రుగులు చేసింది.

kolkata made 163 runs against hyderabad in ipl 2020 35th match

కోల్‌క‌తా బ్యాట్స్‌మెన్ల‌లో ఎవ‌రూ చెప్పుకోద‌గిన ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేదు. కానీ స్కోరు బోర్డును కొంత సేపు ముందుకు క‌ద‌లించే ప్ర‌య‌త్నం చేశారు. ఓపెన‌ర్ శుబ‌మ‌న్ గిల్ 37 బంతుల్లో 5 ఫోర్ల‌తో 36 ప‌రుగులు చేయ‌గా, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 23 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స‌ర్‌తో 34 ప‌రుగులు చేశాడు. అలాగే చివ‌ర్లో దినేష్ కార్తీక్ 2 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో 14 బంతుల్లో 29 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో కోల్‌క‌తా గౌర‌వ ప్ర‌ద‌మైన స్కోరు చేయ‌గ‌లిగింది.

హైద‌రాబాద్ బౌల‌ర్లు ఆరంభం నుంచి కోల్‌క‌తా బ్యాట్స్‌మెన్ ను ప‌రుగులు తీయ‌కుండా అడ్డుకున్నారు. ఈ క్ర‌మంలో వారు ఆ ప్ర‌క్రియ‌లో విజ‌యం సాధించారు. అయిన‌ప్ప‌టికీ చివ‌ర్లో కోల్‌క‌తా బ్యాట్స్‌మెన్ స్కోరు బోర్డును ప‌రుగెత్తించారు. ఇక హైద‌రాబాద్ బౌల‌ర్ల‌లో న‌ట‌రాజ‌న్ 2 వికెట్లు తీయ‌గా, బెసిల్ థంపి, వి.శంక‌ర్‌, ర‌షీద్ ఖాన్‌లు త‌లా 1 వికెట్ తీశారు.

Read more RELATED
Recommended to you

Latest news