నెదర్లాండ్ అందాలను ఆస్వాదిస్తున్న కోలీవుడ్ భామ.. హాట్ లుక్స్ తో..!!

-

ఈ మధ్యకాలంలో చాలామంది హీరోయిన్లు సమయం దొరికింది అంటే చాలు వెకేషన్ వెళ్తూ అక్కడ సిటీని ఎంజాయ్ చేస్తూ బాగా తమని తాము ఆస్వాదిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇటీవల కోలీవుడ్ లో బాగా పాపులారిటీని సంపాదించుకున్న తెలుగుభామ ఐశ్వర్య రాజేష్ కూడా తాజాగా నెదర్లాండ్ వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ అందాలను ఆస్వాదిస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను వదలనే కాకుండా హాట్ లుక్స్ లో కూడా ఫోటోలు వదిలి నెట్టింట కేక పుట్టించింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు కూడా చాలా వైరల్ అవుతూ ఉండడం గమనార్హం.

ఇకపోతే ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీ లక్ష్మీ మేనకోడలు అయినటువంటి ఐశ్వర్య రాజేష్ తెలుగులో సినిమాలలో నటించినా.. తెలుగు కంటే తమిళంలోనే మంచి ఫాలోయింగ్ ఏర్పాటు చేసుకుంది. ముఖ్యంగా తన కెరియర్ ఆరంభంలోనే తమిళ్ హీరో విజయ్ సేతుపతి తో కలిసి రమ్మీ, పన్నైరమ్ వంటి చిత్రాలలో నటించి మరింత పాపులాటిని సంపాదించుకున్న ఈ భామ ప్రస్తుతం తెలుగు, తమిళ్ లో కూడా రాణిస్తూ ఇంకాస్త గుర్తింపును సంపాదించుకుంది. ఇక మొన్నా మధ్య తెలుగులో ఈమె నానితో టక్ జగదీష్ , సాయి ధరమ్ తేజ్ తో రిపబ్లిక్ సినిమాలలో నటించింది. కానీ ఈ రెండు సినిమాల వల్ల కూడా పెద్దగా ఈమెకు కలిసి రాలేదు. ఇక ప్రస్తుతం తమిళ్ ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోలతో సినిమా చేస్తోంది.

ఇకపోతే 1990 జనవరి 10వ తేదీన పుట్టిన ఐశ్వర్య రాజేష్ జీవితంలో చాలా చిన్న వయసులోనే ఎన్నో కష్టాలను అనుభవించింది. ముఖ్యంగా సినిమా వాళ్ల జీవితాలు అద్దాలమేడలా కనిపిస్తాయి కానీ లోపల మాత్రం చాలా అతుకులు ఉంటాయని ఇలాంటి వాళ్ళని చూస్తేనే మనకు అర్థమవుతుంది . ఒక రాయి తగిలితే పగిలిపోయే జీవితాలు వాళ్ళవి అని చెప్పడంలో సందేహం లేదు. కానీ అన్నింటిని ఓర్చుకొని ప్రస్తుతం స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది ఐశ్వర్య .ఇక ఆమె ప్రతిభకు ఓపికకు సలాం కొట్టాల్సిందే. ఇకపోతే ఐశ్వర్య రాజేష్ ఫోటోలను మీరు కూడా చూసేయండి.

Read more RELATED
Recommended to you

Latest news