“మాచర్ల నియోజకవర్గం” ట్రైలర్ లాంచ్ వేదిక ఖరారు

-

హీరో నితిన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డిఫరెంట్ సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తున్నాడు హీరో నితిన్. ప్రస్తుతం హీరో నితిన్‌ “మాచర్ల నియోజకవర్గం” అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ను శేఖర్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ కృతి శెట్టి నటిస్తుండగా.. శ్రేష్ఠ్ మూవీస్ పతాకం పై తెరకెక్కుతోంది.ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, పాటలు, గ్లింప్స్ సినిమాపై అంచనాలను భారీగా క్రియేట్ చేశాయి.

ఇక ఈ సినిమా నుండి ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది చిత్ర బృందం. ఈ ట్రైలర్ ను జూలై 30 తేదీన రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు తాజాగా వేదికను ఖరారు చేస్తూ ప్రోమో రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ట్రైలర్ కు సర్వం సిద్ధం అంటూ మాస్ ప్రోమో విడుదల చేసింది. ఈ ట్రైలర్ గుంటూరులోని బ్రోడీపేట్ ఎల్ఈఎం స్కూలు గ్రౌండ్స్ లో సినిమా ఫ్రీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను సాయంత్రం 5 గంటల నుంచి నిర్వహించనున్నారు. ఇక ఈ చిత్రం ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news