టిపిసిసి రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి ఫోన్..

-

తెలంగాణ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి భువన గిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫోన్ చేశారు. ఇబ్రహీంపట్నం లో నిర్వహించే దళిత దండోరా సభను వాయిదా వేయాలని రేవంత్ రెడ్డి ని ఈ సందర్భంగా ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు. ఈ నెల 18 న పార్లమెంటరీ స్టడీ టూర్ కి వెళ్తున్నందున సభకు హాజరు కాలేనాని రేవంత్ రెడ్డి కి కోమటి రెడ్డి వెంకట్  రెడ్డి తెలిపారు.

ఈ క్రమం లోనే ఇబ్రహీంపట్నం లో నిర్వహించే దళిత దండోరా సభను వాయిదా వేయాలని రేవంత్ రెడ్డి ని కోరారు కోమటి రెడ్డి. ఇక రేపు గాంధీభవన్ లో జరుగనున్న పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో ఇబ్రహీంపట్నం లో నిర్వహించే దళిత దండోరా సభ వాయిదా పై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజ్ఞప్తి మేరకు.. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news