రేవంత్ రెడ్డికి షాక్.. హుజురాబాద్ ఫలితంపై సోనియా గాంధీ కి కోమటి రెడ్డి ఫిర్యాదు!

-

హుజురాబాద్ నియోజక వర్గ ఉప ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 5 నెలలు అయిన కాంగ్రెస్ పార్టీ పట్టించు కోలేదని చురకలు అంటించారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ ఒక్క సభ పెట్ట లేదని మండిపడ్డారు కోమటి రెడ్డి.

దుబ్బాక, నాగార్జున సాగర్ లో పని చేసినట్లు గా హుజురాబాద్ లో కాంగ్రెస్ పార్టీ పని చేయ లేదని అగ్రహించారు. కాంగ్రెస్ పార్టీకి హుజురాబాద్ లో గట్టి క్యాడర్ ఉందని… అయినా తమ వైపు తిప్పు కోవడం లో కాంగ్రెస్ ప్రయత్నం చేయలేదని రేవంత్ రెడ్డి పై ఫైర్ అయ్యారు కోమటి రెడ్డి. హుజురాబాద్ నియోజక వర్గ ఉప ఎన్నికల ఫలితాలపై వాస్తవ పరిస్థితి ని సోనియా గాంధీ కి వివరిస్తానని స్పష్టం చేశారు. హుజురాబాద్ నియోజక వర్గ ఉప ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధైర్యపడొద్దని పిలుపునిచ్చారు కోమటి రెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Latest news