అనాధ హస్విత్ ను దత్తత తీసుకుని… ఉదార స్వభావాన్ని చాటుకున్న ఎంపీ కోమటిరెడ్డి !

-

తెలంగాణ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజకీయంగా ప్రత్యర్ధులపై మాటల తూటాలు పేలినా… స్వార్థం కోసం ఎన్ని రకాల రాజకీయ కుతుక్తులు పన్నినా తనలో కూడా మానవత్వం ఉందని నిరూపించే ఒక మంచి పని చేశాడు. తాజాగా కుషాయిగూడ లో అగ్నిప్రమాదం జరిగి ఒక కుటుంబంలో అందరూ చనిపోయి ఒక అబ్బాయి మాత్రమే బ్రతికిన విషయం తెలిసిందే. ఈ కుటుంబంలో నరేష్, అతని భార్య సుమ మరియు కొడుకు జస్విత్ లు మరణించారు… కానీ నరేష్ పెద్ద కుమారుడు హస్విత్ మాత్రం జీవించి ఉన్నాడు.

దీనితో అతను బంధువులు ఉన్నప్పటికీ అనాధగా మారిపోయాడు. ఈ సంఘటన ఎందరినో కలచివేసింది. అయితే నిన్న ఈ కుటుంబానికి స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించిన కోమటిరెడ్డి హాస్విత్ ను దత్తత తీసుకుంటానని ప్రకటించి అందరినీ షాక్ కు గురి చేశాడు. ప్రస్తుతం కోమటిరెడ్డి ఢిల్లీ లో ఉండగా… హస్విత పేరిట తన పి ఏ ద్వారా లక్ష రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయించాడు మరియు మృతుడు నరేష్ పేరెంట్స్ కు 25 వేలు అందించాడు. కోమటిరెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం ఎందరికో ఆదర్శంగా మారాలని ఆశిద్దాం…

Read more RELATED
Recommended to you

Latest news