మాస్ లుక్ లో వైష్ణవ్ తేజ్ : కొండ పొలం ట్రైలర్ రిలీజ్

-

ఉప్పెన మూవీ తో భారీ సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్న వైష్ణవి తేజ్ నటించిన తర్వాతి సినిమా కొండ పొలం. ఫేమస్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను వై రాజు రెడ్డి మరియు జే సాయిబాబు నిర్మిస్తున్నారు. వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీతి సింగ్ జంటగా నటిస్తోంది.

తొలి సినిమాతోనే 2021లో మొట్టమొదటి భారీ బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న పంజా వైష్ణవ్ తేజ్.. హీరోగా విడుదలవుతున్న రెండో చిత్రం ఇది. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తికాగా… తాజాగా ఈ సినిమా నుంచి బిగ్ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా నుంచి కాసేపటి క్రితమే ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఇక ఈ ట్రైలర్ లో హీరో వైష్ణవ తేజ్ యాక్టింగ్ ఇరగదీశాడు.

అలాగే రకుల్ ప్రీతిసింగ్ కూడా విలేజ్ అమ్మాయిల చాలా చక్కగా పర్ఫామెన్స్ చేసింది. యాక్షన్ సీన్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. పులి తో వేటడే.. సీన్ అందరినీ ఆకట్టుకుంది. ఈ  ట్రైలర్ చూస్తుంటే సినిమా పూర్తిగా క్రైమ్ కథాంశంగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.   ఇక ఈ ట్రైలర్.. ఈ సినిమా అంచనాలను భారీగా పెంచేసింది. కాగా ఈ సినిమాను అక్టోబర్ 8వ తేదీన విడుదల చేయనున్నట్లు కూడా ప్రకటించిన చిత్ర బృందం.

Read more RELATED
Recommended to you

Latest news