మునుగోడు పోలింగ్‌ కు ముందు కూసుకుంట్ల ప్రభాకర్‌ సంచలన పోస్ట్‌ !

-

మునుగోడు పోలింగ్‌ కు ముందు టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ సంచలన పోస్ట్‌ చేశాడు. 2003లో టిఆర్ఎస్ పార్టీలో చేరినప్పటి నుండి ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో చురుగ్గా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడం జరిగిందని అలనాటి ఫోటోలను షేర్‌ చేశాడు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగమై కేసీఆర్ గారి సహకారంతో ఫ్లోరోసిస్ భూతాన్ని అంతం చేయడం జరిగింది. సీఎం కేసీఆర్ గారి సారధ్యంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగతిని సాధించి దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు.

కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను కేంద్ర ప్రభుత్వం మరియు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు స్ఫూర్తిగా తీసుకోని పని చేయడం టిఆర్ఎస్ ప్రభుత్వ పనితనానికి నిదర్శనం. కేసీఆర్ ఆధ్వర్యంలోని తెలంగాణ మోడల్ మన దేశం ఎదురుకుంటున్న అనేక సమస్యలకు త్వరలో పరిష్కారం చూపనుండడం చాలా సంతోషంగా ఉంది. జై తెలంగాణ.. జై భారత్.. జై కేసీఆర్ అంటూ ఫేస్‌ బుక్‌ లో పోస్ట్‌ పెట్టాడు ప్రభాకర్‌.

Read more RELATED
Recommended to you

Latest news